
రుద్రూర్, జనవరి 5 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 1,3,5 లో సోమవారం గర్భిణి బాలింతలకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లు హాజరయ్యారు. అనంతరం సర్పంచ్ ఇందూర్ సునీత, ఉప సర్పంచ్ షేక్ నిస్సార్, వార్డు మెంబర్లకు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మ, రూప, ప్రతిమ, హెల్త్ సూపర్వైజర్ సుమతి, గౌరీ, శిరీష, ఆశా వర్కర్లు, గర్భిణీ బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.