పయనించే సూర్యుడు జూన్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
కిశోర వికాస్ వేసవి శిక్షణా కార్యక్రమం శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు సిడిపీఓ సునీలత మంగళవారం పెరమళ్ళపాడు సచివాలయం పరిధిలోని స్థానిక అంగనవాడీ కేంద్రంలో కిషోరి వికాస్ వేసవి కాలం శిక్షణ కార్యక్రమం బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ సురేఖ మాట్లాడుతూ 11 నుండి 14సంవత్సరాలు, 15 నుండి 18 సంవత్సరాల బాలికలను గ్రూపులుగా విభజించి వారానికి రెండు రోజులు బాల్యవివాహాలు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలికల పరిరక్షణకు అందుబాటులో వున్న చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. మే రెండో తేదీ నుండి జూన్ 10వ తేదీ వరకు జరిగిన కిషోర్ వికాసం కార్యక్రమం ముగింపు జరిగిందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు. స్థానిక గ్రామ సర్పంచి తలపనేని. నరసమ్మ. టిడిపి నాయకుడు తలపనేని. జయంతి నాయుడు . ఎం ఎల్ హెచ్ పి. దివ్యశ్రీ. ఏఎన్ఎం. రత్నకుమారి. ఆశ వర్కర్ శాంతి. అంగన్వాడీ కార్యకర్త. సుభాషిణి.
కిషోర్ బాలికలు తల్లులు తదితరులు పాల్గొన్నారు