అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమంలో కలెక్టర్. పాల్గొని చిన్నారులకు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ.
పయనించే సూర్యుడు జూన్ 17 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని మండల ప్రాథమిక పాఠశాలల లోని అంగన్వాడీ కేంద్రంలో “అమ్మ మాట – అంగన్వాడి బాట” కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, బ్యాగులు, బూట్లు, పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దబడి జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుదీకరణ, త్రాగునీటి , మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.పిల్లలకు అవసరమైన ఆహారం, విద్య, ఆటపాటల వాతావరణం, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అన్నింటిని సమగ్రమైన విధంగా అందిస్తున్నారు అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అనుభవజ్ఞులైన టీచర్లను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని, వారు చిన్నారుల మానసిక, భౌతిక అభివృద్ధికి తగిన తరగతులు నిర్వహిస్తున్నారని వివరించారు. తల్లిదండ్రులందరు చిన్నారులను ఖరీదైన ప్రైవేటు పాఠశాలలలో చేర్పించి ఆర్థిక భారాన్ని మోసుకోవడం అవసరం లేదు అని,అంగన్వాడీ కేంద్రాల్లోనే ఆధునిక వసతులతో కూడిన విద్యాబోధన అందుబాటులో ఉంది. ముందు అంగన్వాడీలలో చేర్పించి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలి. ఇవే పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి” అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాస్, మహిళా శిశు, వయోవృత్తుల మరియు దివ్యంగుల శాఖ అధికారి స్వర్ణలత లేని నా, ఐసిడిఎస్ పిడి ,సిడిపిఓ సూపర్వైజర్లు,అంగన్వాడీ టీచర్లు, పిల్లల,తల్లులు తదితరులు పాల్గొన్నారు.