
కేశంపేట శ్రీ దవళగిరి వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఉండాలి
తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి కేశంపేట మండలం మాజీ జడ్పిటిసి
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలోని శ్రీ దవలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా శ్రీ అలవేలు మంగ సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కేశంపేట మాజీ జెడ్పిటిసి శ్రీమతి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి దంపతులు. ఈ సందర్భంగా కేశంపేట సర్పంచ్ బొజ్జం సంతోష శ్రీశైలం, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విశాల దంపతులను స్వామి వారి ఆశీర్వచనాలు మరియు శాలువాతో సత్కరించారు. పెద్ద ఎత్తున గ్రామస్తులు, భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
