
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:బైంసా పట్టణంలోని గోపాలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు నిర్వహించారు. యోగాభ్యాసం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం గురించి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యోగా బృందానికి చెందిన డా. కె. రఘునాథ్ మరియు డా. సుధాకర్ మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఎంతో ముఖ్యమైందని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని, యువత తప్పనిసరిగా యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అరె రాజు ,డా. ఓంప్రకాష్ ఆధ్వర్యంలోó విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డా.భీమారావు, డా. శంకర్, డా. సంతోష్, శ్రవణ్య, కిషన్, ముత్యం సంతోష్, సాయినాథ్ పటేల్ తదితర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.యోగ దినోత్సవం సందర్భంగా కళాశాల ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడింది. విద్యార్థులు యోగా పట్ల ఆసక్తి కనబరిచి ఆరోగ్యకర జీవన విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిజ్ఞ చేశారు.