పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
అంటరానితనం , సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమానవాటా కోసం, సామాజిక న్యాయం కోసం, తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దత్తులూరు అశోక్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దత్తులూరు అశోక్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారందించిన కృషిని స్మరించుకున్నారు. భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని దత్తులూరి అశోక్ పేర్కొన్నారు. ముందుచూపుతో బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ముడు ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని దుత్తలూరు అశోక్ పునరుద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ తొలి ప్రభుత్వం, దళిత బంధు సహా పలు పథకాల రూపంలో అమలు చేసిందని, పదేండ్ల కాలంలోనే సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. పాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు,తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి, డా బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. భారత జాతి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు