
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 2(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండలంలో సెంటర్ఆఫ్ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సి.ఐ.టి.యు.) ఆధ్వర్యంలో, విశాఖపట్నంలోడిసెంబర్ 31 నుండిజనవరి4వరకు జరిగే సి.ఐ.టి.యు.18వ అఖిలభారత మహాసభలను జయప్రదంచేయాలని అంగన్వాడీవర్కర్లు, ఆశా వర్కర్లుమరియు సి.ఐ.టి.యు. నాయకులుకలిసి పోస్టర్నువిడుదలచేశారు.ఈసందర్భంగా సి.ఐ.టి.యు. నాయకులు,జిల్లా ఉపాధ్యక్షులుఉమాగౌడ్ మాట్లాడుతూ
కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు కార్మికులపైదాడిచేసే విధానాలు అవలంబిస్తున్నాయని, లేబర్ కోడ్స్నువెంటనేరద్దు చేయాలని,సమానపనికి సమానవేతనం ఇవ్వాలని,కనీసవేతనం నెలకుఇరవైఆరువేలు గా నిర్ణయించాల్సినఅవసరం ఉందనిపేర్కొన్నారు.అంగన్వాడీ,ఆశా వర్కర్లపైతీవ్రపని భారంపెట్టి,సరైన వేతనాలుఇవ్వకుండా ప్రభుత్వంకాలయాపన చేస్తోందనిఆయన తెలిపారు.కొత్త ప్రభుత్వాలువచ్చిన తరువాతఅంగన్వాడీ, ఆశా వర్కర్లపై రాజకీయవేధింపులు పెరిగాయని, అదనంగాఅధికారుల వేధింపులు తీవ్రతరమయ్యాయని ఆగ్రహంవ్యక్తం చేశారు.వెంటనే అంగన్వాడీ,ఆశా వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలి,
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.సమానపనికిసమాన వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి.వర్కర్లకునాణ్యమైన మొబైల్ ఫోన్లు అందించాలి.అధిక యాప్ సర్వేలను తగ్గించాలి అని పేర్కొంటూ,ఈ డిమాండ్ల సాధన కోసంరాబోయే రోజుల్లో సి.ఐ.టి.యు. భారీ స్థాయి ఉద్యమాలు, పోరాటాలు కొనసాగిస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ.టి.యు. నాయకులు మహాలక్ష్మి,బషీర్ అహ్మద్,మాయకుంట్ల మోహన్,పెద్దన్న, శ్రీనివాసులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
