
పయనించే సూర్యుడు న్యూస్ :ఏపీలో రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా రోడ్డు ప్రమాదాలు తగ్గడంలేదు. సోమవారం అర్ధరాత్రి పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుమంట్ర మండలం పోలమూరులో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. గోడను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో స్పాట్లోనే మగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. వివరాలలోకి వెళ్తే..పెనుమంట్ర పరిధిలోని పోలమూరు గ్రామంలో మద్యం మత్తులో బైకుపై వెళ్తున్న ముగ్గురు నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఉన్న గోడను అతివేగంతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తలించారు. మద్యం తాగి వాహనాలు నడపడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు. యువకులు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ప్రమాదంలో పోలమూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ, అంజిబాబు, రాజులు మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాద సమయానికి ముందు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం అర్ధరాత్రి 12.30 సమయంలో తమ నివాసాలకు వస్తుండగా ప్రమాదం జరిగింది.