చింతూరు డివిజన్ లో కూడా 15 మీటర్లు వరకు ఆక్రమణలు తొలగించాల్సిందే : ఆదివాసీ జెఏసి అనిల్ కుంజా
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 12
ఆర్ అండ్ బి రోడ్డుపై అక్రమనిర్మాణాల తొలగింపు అల్లూరి జిల్లాలో కొన్ని చోట్ల అధికారులకు ఆధాయ వనరుగా మారిందని,అడుగుకు ఒక రేటు చొప్పున అక్రమ నిర్మాణదారుల దగ్గర నుండి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని,ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కొయ్యూరు మండల డిప్యూటీ తహశీల్దార్ జెడ్పీ గెస్ట్ హౌస్ లో కొయ్యూరు వర్తక సంఘంతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతూ,రోడ్డుకు ఇరువైపులా 50,50 అడుగులు అక్రమ నిర్మాణాలను తొలిగించాలి, కానీ సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ లతో పాటు కోర్టులను కూడా మేనేజ్ చేస్తానని,50కి బదులు15 అడుగుల వరకే అక్రమ నిర్మాణాలను తొలిగిస్తానని,అందుకు అడుగుకు ఒక రేట్ ఫిక్స్ చేసినట్లు తెలిసింది,ఒకవైపు కోర్టు ఆదేశాలతో రంపచోడవరం, మారేడుమిల్లి మండలాలలో అక్రమ నిర్మాణాలను తొలిగిస్తుంటే,చింతూరు డివిజన్ లో కూడా పూర్తి స్థాయిలో 15 మీటర్లు ఎందుకు తొలగించరో చెప్పాలని కచ్చితంగా తొలగించాల్సిందే అని అయన డిమాండ్ చేసారు. కొన్ని మండలాలలో పూర్తిగా మరికొన్ని మండలాల్లో నామమాత్రంగా అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారని.కొయ్యూరు మండలంలో మాత్రం అధికారులు చేతివాటం మొదలైందని చెప్పడానికి అక్కడి ఆర్ అండ్ బి రోడ్డు అక్రమ నిర్మాణదారులతో మండల డిప్యూటీ తహశీల్దార్,ఇతర అధికారులు గెస్ట్ హౌస్ లో ప్రత్యేక సమావేశం,రాత్రుల్లు ఇళ్లలో సమావేశం కావడం,ఆ సమావేశాలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే జరుగుతున్నట్లు ప్రచారం చేయడం ఎంతవరకు నిజమో,కొయ్యూరు డిప్యూటీ తహశీల్దార్ ఇన్ ఛార్జ్ తహశీల్దార్ హోదాలో ఇలాంటి సమావేశాలు పెట్టడం ఎంతో నామోషీ,దీనిపైనా జిల్లా అధికారులు పూర్తి విచారణ జరిపి భాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు.