కనీసం ఆరా తీయని ప్రభుత్వ అధికారులు.
పయనించే సూర్యుడు;జూన్ 23: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని మొరుమూరు పంచాయతీ పరిధి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గృహాల గురించి ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్న సంగతి తెలిసింది.కానీ గ్రామాలలో రెండు మూడు లిస్టులు చెబుతూ ప్రభుత్వ అధికారులు ప్రజల్ని మోసం చేస్తున్న సంగతి ఎవరు గమనించలేకపోవడం విశేషం. విషయమేమనగా మొదలిస్టులో కొన్ని పేర్లు ఉండగా రెండవ లిస్టులో అసలు పేరు లేకపోవడం అనేది గమనార్హం. కానీ ప్రజలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.అని చెప్పేసి పూర్తి సమాచారం సేకరించకుండా ప్రభుత్వ అధికారులు ఇష్టం వచ్చిన రీతిగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారన్న సంగతి మీడియా ముఖంగా తెలిసింది.ఈయొక్కసంఘటనలకు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా దర్యాప్తు చేసి అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా గత లిస్టులో పేర్లు ఉన్నటువంటి వారి యొక్క పేర్లు డిలీట్ అయినటువంటి విషయాలని పత్రిక ముఖంగా వారి యొక్క ఉద్దేశాలను తెలియజేశారు. ఇకనైనా ప్రభుత్వ ఉద్యోగులు మేలుకొని సరైనటువంటి వాళ్లకు అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయవలసిందిగా ఆ యొక్క ప్రజలు కోరుకున్నారు.