పయనించే సూర్యుడు జనవరి 21 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు హోలిస్టిక్ హాస్పిటల్ వద్ద చేపడుతున్న వరద కాలువ పనులు నిమిత్తం జరుగుతున్న పనులను, జి హెచ్ ఎమ్ సి ఇంజనీరింగ్ హెచ్ ఎం డబ్ల్యు ఎస్ ఎస్ బి మరియు ట్రాఫిక్ అధికారులతో కలసి పనులను పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, అన్ని డిపార్ట్మెంట్లు మరియు ప్రజల సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని, అలానే ప్రజలు ఆత్యవస్రతను మరియు శాశ్వత పరిష్కారం దిశగా పనులు జరుగుతున్నందున ప్రజలు సంయమనం పాటించి ట్రాఫిక్ మల్లింపుల దగ్గర క్రమశిక్షణతో అధికారులకు సహకరించాలని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలానే అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని , ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదితామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు మరియు పార్క్ వాకర్లు తదితరులు పాల్గొన్నారు.