పయనించే సూర్యుడు// న్యూస్ మే 27//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
నేడు అమావాస్య పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని స్థానిక వీరభద్ర స్వామి ఆలయం దగ్గర NB నర్సింలు నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు ప్రత్యేక పూజల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో అన్నదాత NBనర్సింలు నాయుడు, కమిటీ సభ్యులు శివకుమార్ మేస్త్రి, జి.శివకుమార్,ఈసరి నాగప్ప, జి.కొండయ్య,రామంజి. జి కిష్టప్ప. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.