
వైరా మున్సిపాలిటీ కేసీఆర్ పాలనల్లోనే అభివృద్ధి
మాజీ ఎమ్మెల్యే బాణోత్ చంద్రవతి
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డ్ లో సిపిఎం బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిని కట్టా స్వరూప రాణి ,కుటమి కౌన్సిలర్ అభ్యర్థులు ఒకటవ వార్డు బిఆర్ ఎస్ అభ్యర్థి మద్దెలరవి మరియు పదిహేనవ వార్డ్ సీపీఐ అభ్యర్థి నల్లమోతు శైలజ విజయాన్ని కాంక్షిస్తూ, వైరా మాజీ శాసనసభ్యురాలు బానోత్ చంద్రావతి బుధవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కట్టా స్వరూప రాణి తో కలిసి భానోత్ చంద్రావతి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించారు ఓటర్లను కలిసి కారు గుర్తుకు ఓటు వేసి కట్టా స్వరూప రాణి ని భారీ మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా కుటమి సభ్యులను కూడా ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా భాణోత్ చంద్రావతి మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం కేసీఆర్ పాలల్లోన జరిగిందని ఎన్నికలకు ముందు 20 కోట్ల రూపాయల నిధులను మున్సిపాలిటీ కేటాయించడం జరిగింది. అభివృద్ధి కేసీఆర్ పాలనలో జరిగింది తప్ప కాంగ్రెస్ పాలలో ఏమి జరగలేదని ఆమె అన్నారు. కేవలం మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ ద్యేమని, వైరా మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ తోనే అని ఆమె అన్నారు, కట్టా స్వరూప రాణి ని కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే వైరా మున్సిపాలిటీ అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైన పాలన కొనసాగిస్తారని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్, సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జున రావు,పలువురు నాయకులు పాల్గొన్నారు