ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి
ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి
హాజరైన బీఆర్ఎస్ నాయకులు మురళి యాదవ్
( పయనించే సూర్యుడు జూన్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం నందిగామ మండలంలోని శ్రీనివాసులగూడ గ్రామంలో ఆంజనేయస్వామి ధజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు మురళీ యాదవ్ మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఈట గణేష్ వంకాయల నారాయణ రెడ్డి,కట్న రవీందర్,విట్టల్, గొర్లపల్లి అశోక్, గోవింద్ అశోక్,పాట్వరి శ్రవణ్,దామోదర్ రెడ్డి,నర్సిములు, చంద్ర రెడ్డి, కట్న శ్రీశైలం,కుమార్ గౌడ్, హన్మంత్ రెడ్డి, రాంరెడ్డి,మొయినోదిన్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,కుమ్మరి క్రిష్ణ,ఈదులపల్లి గణేష్ గౌడ్,రాజేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి,యాదగిరి రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,శివ చారి,అబ్బాస్, కోరె రాజు, బండ కుమార్ తదితరులు..