పయనించే సూర్యుడు జూన్ 21 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు డివిజనల్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసిల్దారు పెంచలయ్య మరియు రిటైర్డ్ విఆర్ఓ శేషగిరిరావు లను ఆర్డీవో పావని తహసిల్దార్ పద్మజా కుమారి శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు, అనంతరం కేకు కట్ చేసి అందరూ సంతోషాలు పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్డిఓ పావని మాట్లాడుతూ రెవెన్యూ సందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగి విపత్కర సమయాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మన వంతు కృషి చేయాలని ప్రతి ఒక్క ఉద్యోగి తమ దగ్గరకు వచ్చిన వారిని గౌరవంగా చూసి వారి పనిని వెంటనే పరిష్కరించవలసిందిగా అందరికీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు తహసిల్దారు డిటి శాంతి స్వరూప్, రాజనారాయణ,ఆర్ ఐ కొండయ్య, వీఆర్వోలు వీఆర్ఏలు ఆర్డీవో . తహసిల్దార్ ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు