
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసరలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో "విమెన్ ఇన్ సైన్స్: క్యాటలైసింగ్ రైసింగ్ తెలంగాణ & వికసిత భారత్ " అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ముఖ్య అతిథుల సందేశం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగాగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ ప్రొ. ఏ. గోవర్ధన్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు.యూనివర్సిటీ ఓ.ఎస్.డి & అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొ. ఇ.మురళీదర్శన్ మాట్లాడుతూ, పరిశోధన సంస్కృతిని బలోపేతం చేయడం ద్వారానే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని, విద్యార్థులు సర్ సి.వి. రామన్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ప్రముఖ వక్తల ప్రసంగాలు ఈ వేడుకల్లో పలువురు నిపుణులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు:ప్రొ. వి. కాంచన (ఐ.ఐ.టి. హైదరాబాద్): వీరు ఐఐటి హైదరాబాద్లోని ఫిజిక్స్ విభాగంలో విశిష్ట ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. టోపోలాజికల్ మెటీరియల్స్ మరియు ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ థియరీలో తనకున్న అపారమైన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. సైన్స్ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించి, వారు ఎలా అద్భుతమైన పరిశోధనలు చేయవచ్చో వివరిస్తూ విద్యార్థినులకు ఒక స్ఫూర్తిదాయక రోల్ మోడల్గా నిలిచారు.ప్రొ. జి.ఎస్. వైదీశ్వరన్ (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్): స్కూల్ ఆఫ్ ఫిజిక్స్కు చెందిన వీరు కంప్యూటేషనల్ ఫిజిక్స్ మరియు మెటీరియల్ సైన్స్లో నిపుణులు. అధిక పీడనం వద్ద పదార్థాల ప్రవర్తన మరియు ఎలక్ట్రానిక్ లక్షణాలను కంప్యూటేషనల్ పద్ధతుల ద్వారా ఎలా విశ్లేషించవచ్చో వివరించారు. పరిశోధనల్లో 'ఫస్ట్-ప్రిన్సిపుల్ కాలిక్యులేషన్స్' ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
ప్రొ. జి. కృష్ణ చైతన్య (ఎస్.ఆర్.టి.ఎం.యూనివర్సిటీ, నాందేడ్): క్వాంటం కెమిస్ట్రీ మరియు స్పెక్ట్రోస్కోపీ రంగాల్లో వీరికి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. పరమాణు నిర్మాణం, రేషనల్ డ్రగ్ డిజైన్ (ఔషధాల తయారీ)లో క్వాంటం కెమిస్ట్రీ ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమైన తన పరిశోధనల ద్వారా సైన్స్ విద్యార్థులకు పరిశోధనా పత్రాల ప్రాముఖ్యతను వివరించారు.ప్రొ. ఏ. ఉమ (జె.ఎన్.టి.యు.హెచ్., హైదరాబాద్): జె.ఎన్.టి.యు.హెచ్లోని సెంటర్ ఫర్ బయోటెక్నాలజీకి చెందిన వీరు, మైక్రోబియల్ సైన్సెస్ మరియు ఫెర్మెంటేషన్ టెక్నాలజీలో నిపుణులు. వైద్యం మరియు పారిశ్రామిక రంగాల్లో బయోటెక్నాలజీ అప్లికేషన్స్, ముఖ్యంగా పర్యావరణ శుద్ధి గురించి వివరించారు.ప్రొ. ఓదేలు వంగా (యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న వీరు, సైన్స్ మరియు టెక్నాలజీ అనుసంధానం గురించి మాట్లాడారు. మెషిన్ లెర్నింగ్ మరియు బయోఇన్ఫర్మేటిక్స్ కలయికతో ఆరోగ్య రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను వివరించారు. నిజ జీవితంలోని శాస్త్రీయ సవాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిష్కారాలను ఎలా కనుగొనవచ్చో విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమ నిర్వహణ ఫిజిక్స్ విభాగాధిపతి, ప్రోగ్రామ్ కన్వీనర్ డా. జి. దేవరాజు ఆధ్వర్యంలో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డా. ఎస్. విఠల్, శేఖర్ శీలం, డా. కె. మహేశ్, ప్రకాశ్ లతో పాటు ఇతర విభాగాధిపతులు డా. బి. శ్రీనివాస్ (కెమిస్ట్రీ), డా. సురేష్ దేవనపల్లి (మ్యాథమెటిక్స్), డా. ఏ. సాయి కృష్ణ (బి.ఎస్.బి.ఇ) పాల్గొన్నారు.ఫిజిక్స్ ఫ్యాకల్టీ సభ్యులు చింతా నరేశ్, మండ సతీశ్, ఎం.రామకృష్ణ, డా. సుజాత, డా. గజ్జెల శ్రీనివాస్, తిరుపతి, శ్వేత, రమాకాంత్, ఇతర అధ్యాపకులు, భొధనబోధనేతర సిబ్బంది, విద్యార్థులు ఈ సైన్స్ వేడుకల్లో పాల్గొని ప్రదర్శనలను తిలకించారు.
