
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గంలో కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి గ్రామానికి చెందిన కుర్ర బాగ్య-రమేష్ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని వారికి బహుకరించారు. ముఖ్యమంత్రి పేద ప్రజలకు అండగా నిలబడి సొంత ఇల్లు నిర్మాణం చేసుకొని ఆత్మగౌరవంతో బతికేల చేస్తున్నారని అన్నారు.కార్యక్రమంలో కమ్మర్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింకెట రవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
