పయనించేసూర్యుడు జూన్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డు నందు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు రేగళ్ల నాగలక్ష్మి ఈరోజు ముగ్గు పోయించుకొని ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ హాజరై ప్రభుత్వ నిబంధన ప్రకారం కొలతలు వేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ గిరీశా ఇందిరమ్మ ఇంటి కమిటీ సభ్యులు జీవీ భద్రం, ఉలింగ సతీష్, వనజ, లింగంపల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.