సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, TGTTF రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్
పయనించే సూర్యుడు జూన్ 26 (పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం :సేవాలాల్ సేన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ అధ్యక్షతనజిల్లా కేంద్రంలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ యందు సేవాలాల్ సేన రాష్ట్రస్థాయి సామాజిక రాజకీయ శిక్షణ తరగతుల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, TGTTF రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాథోడ్ పాల్గొన్నారు వారు ఈ సమావేశానికి ఉద్దేశించి మాట్లాడుతూ గిరిజన జాతి కోల్పోతున్న సాంప్రదాయ సంస్కృతిని పరిరక్షిస్తూ రాజ్యాంగం లో గిరిజనులకు కల్పించిన హక్కులు మరియు బహుజన వర్గాల అభివృద్ధికై సమానత్వం సమన్యాయం అనే నినాదంతో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా సేవాలాల్ సేన ఉద్యమాలు చేస్తున్నదని అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలను పోరాడి సాధించిన రిజర్వేషన్లు ప్రభుత్వ పాలకులు యుహాత్మకంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ అన్ని రంగాలలో తూట్లు పొడిచే పనిలో నిమగ్నమయ్యారని స్పష్టమవుతున్నదని అన్నారు. ఇప్పటికైనా బంజారా సమాజం మేల్కొని జీవో నెం 3 విషయంలో ఐక్యంగా పోరాటాలు చేయాలని అన్నారు.జీవో నెం 3 కోల్పోవడం వల్ల ఎంతో మంది గిరిజన విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా ఎన్నో సమస్యలు బంజారా జాతి ఎదుర్కొంటుంది కాబట్టి జూన్ 28 29 తేదీలలో డాన్ బాస్కో హాల్ ప్రగతి నగర్ రామంతపూర్ హైదరాబాద్ యందు జరుగు సేవాలాల్ సేన రాష్ట్రస్థాయి సామాజిక, రాజకీయ శిక్షణ తరగతులలో ఎంతోమంది నికార్సైన సేవాలాల్ సేన సైనికులను తయారు చేసి ఈ రాష్ట్రంలో బంజారాలకు జరుగుతున్న అన్యాయాలపై బలంగా ఉద్యమించడానికి సేవాలాల్ సేన సైనికులు శిక్షణ తీసుకుంటారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా సహాయ కార్యదర్శి జరుపల లాలు నాయక్, జూలూరుపాడు మండల అధ్యక్షులు బానోతు లక్ష్మణ్ నాయక్, అనిల్ నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు