బెస్ట్ అవార్డు అందుకున్న డాక్టర్ కార్తీక్ కు అభినందనలు
సుమన్ టివి అద్వర్యంలో నిర్వహించిన డాక్టర్ల ఉత్తమ సేవలను గుర్తించి అవార్డు
( పయనించే సూర్యుడు జూన్ 20 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కు చెందిన ప్రముఖ డాక్టర్ కార్తీక్ చేస్తున్న సేవలకు సుమన్ టీవీ యాజమాన్యం ఉత్తమ పురస్కారాన్ని అందజేసింది. ఇటీవల నోవాటెల్ హోటల్ లో జరిగిన అవార్డుల కార్యక్రమం సందర్భంగా డాక్టర్ కార్తీక్ కు సన్మానంతో పాటు ప్రశంసా పత్రాన్ని సుమన్ టివి యాజమాన్యంతో పాటు సిపిఐ నేత నారాయణ చేతుల మీదుగా అందజేశారు. సుమన్ టివి వారి ఆధ్వర్యoలో నిర్వహించిన ఉత్తమ సేవలకు గాను ఈ అవార్డు ఎంపిక చేసినట్లు డాక్టర్ కార్తీక్ మీడియా తెలిపారు. కోవిడ్ సమయంలో ఏంతొ మందికి ఉత్తమ సేవలను అందించి, షుగర్ వ్యాధి గ్రస్తులకు మరియు సేవలు అందిస్తున్న డాక్టర్ కార్తీక్ అవార్డు రావడం పట్ల అందరు హర్షం వ్యక్తం చేసారు. రెడ్ క్రాస్ సొసైటీలో ప్రముఖులైన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ కుమారుడైన డాక్టర్ కార్తీక్ కు కూడా ఉత్తమం అవార్డు పొందడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు పొందాల