
తపస్ జిల్లా శాఖకు నూతన జిల్లా కలెక్టర్ సూచన
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28
ఏప్రిల్ 27 నారాయణపేట… నారాయణపేట జిల్లాలో ఉపాధ్యాయులందరికీ చేత స్వీయ జనగణన పూర్తి చేయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖకు నూతన జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. ఉపాధ్యాయులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని పారదర్శకంగా ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించి జనగణనను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నరసింహ జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, జిల్లా నాయకులు సీతారాములు శ్రీనివాస్ మండల అధ్యక్ష కార్యదర్శులు రవికుమార్ చిన్న నరసింహులు మహిళా విభాగం నాయకులు పద్మావతి, నవ్య శ్రీ, వేదావతి,
స్వాతి, వెంకటేష్ సాయికిరణ్ రాజేష్ భాస్కర్ శ్రీకాంత్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు