పయనించే సూర్యడు: మార్చి 15: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి. ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని చేరుకూరు పరిధిలోని ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కార్యక్రమంలో భాగంగా చెరుకూరు పరిధిలో గల మిర్చి తోటలలో వలస వ్యవసాయ కూలీలకు వడదెబ్బ ఎందువల్ల వస్తుంది వడదెబ్బ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అనే విషయంపై వడదెబ్బ నుండి నివారణ ఏ విధంగా తీసుకోవాలి చికిత్స ఏవిధంగా చేసుకోవాలని, అవగాహన కల్పించి తెలియజేయడం జరిగినదిదని హెచ్ ఈ ఓ వేణుగోపాలకృష్ణ తెలియజేశారు. అంతేకాకుండా కూలీలకు వడదెబ్బ గూర్చి వివరిస్తూ తలనొప్పి, జ్వరం, కళ్ళు ,తిరగడం ,వాంతులు విరేచనాలు, తికమక అవడం ,గుండె వేగంగా కొట్టుకోవడం ,మూత్రం పసుపు రంగులో రావడం వంటి లక్షణాలు ఉండి సర్వం మీద ఎటువంటి చమట లేకుండా చర్మం ఎర్రగా కందిపోయి ఉంటే వెంటనే వడదెబ్బ అని గుర్తించి దగ్గరలో ఉన్న వైద్య కేండ్రానికి వచ్చి చికిత్స చేసుకోవాలని సూచించారు. ఈయొక్క కార్యక్రమంలో హెచ్ఈఓ, వేణుగోపాలకృష్ణ, ఎంఎల్ హెచ్ పి నవీన్ ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.