కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి ములకలపల్లి రవిమాదిగ
పయనించె సూర్యుడు జూన్ 29 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : జూలై 7న నిర్వహించబోయే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జి ములకలపల్లి రవి మాదిగ టేకులపల్లి మండల కేంద్రం లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ సంఘాల మండల స్థాయి ముఖ్య కార్యకర్తల వేశంలో ఆయన మాట్లాడారు. అన్ని ఎమ్మార్పీఎస్ దిమ్మెలు నిర్మించాలన్నారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధనకై పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారినాయకత్వంలో అలుపెరుగని పోరాటం చేసి ఫలితాలు సాధించుకున్నామని. ఈ ఫలితాన్ని గ్రామస్థాయి వరకు మన జాతి బిడ్డలకు 100 ఏళ్ల భవిష్యత్తు ఉండే విధంగా పోరాట ప్రస్థానం జరిగిందని అదే క్రమంలో ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అణగారిన కులాల లకు కులాల హక్కులకై పోరాటం చేసి అనేక ఫలితాలు ఎమ్మార్పీఎస్ సాధించామని అన్నారు అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి కమిటీలు పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు చేసి జూలై 7 తారీఖున 31వ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జనక ఇస్తారుమెంతేన ప్రభాకర్ మాదిగ సత్యం సైదులు మరియు నామా నాయక్ బొజ్జ నాయక్ ఇస్లావత్ సాయి చిన్న తదితరులు పాల్గొన్నారు