పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 14
ఎమ్మెల్యే గారు… ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ విషయంలో మీ పార్టీ ద్వంద వైఖరి ఏంటని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరాజును భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ప్రశ్నించారు.ఆర్ అండ్ బి రోడ్డు అక్రమ నిర్మాణాలను తొలగించి,విస్తరణ చేయాలని ఎమ్మెల్యే ప్రకటన సంతోషకరం,కానీ ఆర్ అండ్ బి రోడ్డు స్ధలాలపై అక్రమ నిర్మాణాలు చేస్తే,వాటిని తొలిగించాలని హై కోర్టు ఆదేశిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ,వైస్ ఎంపీపీ,ఎంపీటీసీ,సర్పంచ్ లు రోడ్డు ప్రక్కన అక్రమ నిర్మాణాలు తొలగిస్తే శవాలగుట్టగా,స్మశానంలాగా మారి పోతుందని తెగ గగ్గోలు పెడుతున్నారు,నష్ట పరిహారం ఇవ్వాలని కొందరు కోరారు. విశ్వేశ్వరరాజు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే కాకుండా,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మీ పార్టీకి చెందినవారిని ఎందుకు నిరోధించడం లేదని,మరోవైపు మాజీ ఎమ్మెల్యే, తెదేపా పాడేరు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గిడ్డి ఈశ్వరి వర్తక సంఘం వారితో కలసి అక్రమ నిర్మాణాలు సక్రమమే అంటూ జిల్లా కలెక్టర్ మీద ఒత్తిడి తేవడం తెలిసిన విషయమే,ఆమెకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ విషయంలో హైకోర్టు ఆదేశాలనుపాటించాలంటున్నారా అనే సందేహం కలుగుతోంది.ఈ అక్రమ నిర్మాణాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ విషయంలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన పెద్ద,పెద్ద నాయకులు మాట్లాడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, ఎన్నికల సమయంలో ఎంతో మంది నాయకులు ప్రజల పక్షాన ఉంటామని ఇప్పుడు మొహం చాటేసారని ఆయన ఎద్దేవా చేసారు