పయనించే సూర్యుడు మే 29 (పొనకంటి ఉపేందర్ రావు )
గురువారం టేకులపల్లి మండలం లోని విత్తన దుకాణాలు డి.ఎస్.పి చంద్ర భాను, వ్యవసాయ శాఖ అధికారి ఎంఏఓ ఎన్ అన్నపూర్ణ, లు విత్తన దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫెర్టిలైజర్ షాప్ కు సంబంధించిన లైసెన్స్, విత్తన అమ్మకాల పెర్మిషన్ కాపీ, గత సంవత్సరం అమ్మకాలు జరిపిన రిజిస్టర్ ను వారు తనిఖీ చేశారు. విత్తనాలు షాప్ లో ఉంచి అమ్ముతారా అనే విషయాలు షాపు యజమానిని అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే, షాపు లైసెన్స్ రద్దు జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ తాటిపాముల సురేష్, ఎస్.ఐ ఏ రాజేందర్, షాపు యజమానులు పాల్గొన్నారు.