పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 2 :-రిపోర్టర్ (కే శివ కృష్ణ )పదిమందిలో తిట్టినట్లుగా నిరూపించాలిసుప్రీం కోర్ట్ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది.ఈ చట్టం కింద నేర నిరూపణ జరగాలంటే నిందితుడు ఎస్సీ ఎస్టీ వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగ దూషించినట్లు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.రక్షణ కోసం తెచ్చిన ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళకి ఇది చెంప పెట్టని విశ్లేషకులు అంటున్నారుకుల రిజర్వేషన్లపై మాట్లాడటం ఏ వర్గానికి వ్యతిరేకంగా పరిగణించబడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అటువంటి సందర్భంలో SC-ST చట్టం కింద కేసు నమోదు చేయబడదని తెలిపింది.తాజాగా ఓ మహిళ తన బాయ్ఫ్రెండ్తో సంబంధాన్ని తెంచుకుంది. అనంతరం వాట్సాప్లో మెసేజ్ పంపింది. ఆ మహిళ తనకు వాట్సాప్లో కులపరమైన వ్యాఖ్యలు చేస్తూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిందని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. దీనిపై కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పు విలువరించింది. ఈ మెసేజ్లో ఏమీ లేదని.. జస్టిస్ ఊర్మిళ జోషి-ఫాల్కే అన్నారు. మహిళపై కేసును కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు. ఆ మహిళ బహిరంగంగా ఎలాంటి కులం వ్యాఖ్య చేయలేదని పేర్కొన్నారు. వ్యక్తిని అవమానించలేదని.. ఎస్సీ-ఎస్టీ వర్గానికి చెందిన ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఏమీ చేయలేదని తెలిపింది.వాస్తవానికి.. ఈ కేసు నాగ్పూర్కు చెందినది. 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ 28 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ మధ్యప్రదేశ్ వాసులు. ఇద్దరూ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ సంబంధాన్ని తమ కుటుంబాలకు తెలియకుండా దాచిపెట్టారు. అయితే ఆ వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని మహిళకు తెలియడంతో విడిపోయారు. దీంతో ఆమెకు వాళ్ల ఇంట్లో వాళ్లు సంబంధాలు చూశారు. ఈ సంబంధం ఆ యువకుడి కారణంగా చెడిపోయింది. దీంతో ఆమె ఓ మెసేజ్ పంపింది. దాని ఆధారంగా ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తండ్రిని కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా బాంబే కోర్టు తీర్పు వెలువరించింది.దీని ప్రకారం ఇకపై నకిలీ కేసు తగ్గే అవకాశం ఉందని పేర్కొంటున్నారు