
పయనించే సూర్యుడు 13 6 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గంలో ఈ రోజు శనివారం రోజున ఏర్గట్ల మండల కేంద్రాములో ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి అధ్యక్షతన జరిగింది, ఇట్టి కార్యక్రమం లో మొదటగా మొన్న నూతన ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శివన్నోల్ల శివకుమార్ ఎన్నికైనందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సన్మానం చేసి అభినందించి నూతన గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఎంపిక గురించి చర్చించారు. ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పని చేసినవారిలో కొంత మందిని పార్టీ పదవులు మరి కొంత మందికి లోకల్లో నామినేటెడ్ పదవులు జరుగుతుందని అన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ సీఎం రేవంతన్న ప్రజాపాలన ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత మన పైన యుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్లు 2034 సంవత్సరం వరకు కాంగ్రెస్ ప్రభుత్వం యుంటుదని దీనికి మనమంతా కలిసి కష్టపడి పని చేద్దామని అన్నారు. ఎరువుల యాప్ అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశామని, ఎరువులను తయారు చేసేది, ధరలను నియంత్రించేది, ఎరువులను రాష్ట్రాలకు పంపిణీ చేసేది కేంద్ర ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలీ. మన ఒక్క రాష్ట్రంలో కాదు ప్రక్కన యున్న రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ క్రింద మొన్ననే యాప్ ప్రారంభించినది . బిజెపి ఎంపీ రఘునందన్ చెప్పినట్లు ఎరువుల విషయం కేంద్ర ప్రభుత్వానికి సంబదించిన అంశమని, రాష్ట్రాలకు ఎరువులకు సంబందము లేదని చెప్పారు. మన రాష్ట్రంలో రామగుండంలో యున్న కేంద్ర ప్రభుత్వం ఎరువుల ప్యాక్టరీ నుండి మన రాష్ట్రానికే వాడుకుంటే మనకు సరిపోతుంది కానీ కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఇక్కడ నుండే సరఫరా చేస్తుంది. మన తెలంగాణ రాష్ట్రనికి కావాల్సినంత ఎరువులు డిమాండ్ బట్టి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి విన్నవించినా కానీ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు, ఎరువులు సరఫరా చేసేది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని మర్చిపోయి వీళ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన రాజకీయాలు చేస్తూ వినతి పత్రాలు ఇస్తున్నారు అన్నారు. గత BRS పదేళ్ల పాలనలో కూడా రైతులు ఎరువుల గురించి చెప్పులు, పట్టా పాసుబుక్ లు లైనులు పెట్టడంతో పాటు రైతులు పడ్డ బాధలు మర్చిపోయి విమర్శించటం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీలు వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఎరువుల కోటాను ఇప్పించే ఏర్పాట్లు చెయ్యాలని డిమాండ్ చేశారు. అదే విధముగా రైతాంగానికి ఇబ్బంది చేస్తున్న ఎరువుల యాప్ ను తీసివేసి పాత పద్ధతిలో ఎరువులు రైతులకు పంపిణీ చేసే విధముగా చొరవ తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నట్లు శివకుమార్ తెలిపారు. ఇట్టి కార్యక్రమములో ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అత్యధికముగా పాల్గొన్నారు