పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 బాల్కొండ ప్రతినిధి కే లింబాద్రి తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో
ఈ రోజు సిరికొండ మండలంలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమము కొండూర్, సరిపల్లి తండా, పెద్ద వాల్గోట్, పోతునూరు నాలుగు గ్రామాలలో పాదయాత్ర నిర్వహించటం జరిగింది. ఆ సిరికొండ మండల ఈ కార్యక్రమ ఇంచార్జ్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ పాల్గొనటం మాట్లాడటం జరిగింది. పార్టీ ఆదేశాల మేర పాల్గొని ఈ రోజు మండలములో కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంత చెయ్యటం జరిగింది, రేపటి నుండి ఇంకా మిగిలిన 24 గ్రామాలలో కొనసాగనుంది. దీనికి సహకరించిన సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు - జై కాంగ్రెస్