తహసిల్దార్ పార్థసారథి, డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో
పట్టా భూములుగా మార్చండి అంటూ అధికారులకు శ్రీను నాయక్ వినతి
పట్టా భూములను లావని భూమిగా తప్పుడు సమాచారం
( పయనించే సూర్యుడు జూన్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం కిషన్ నగర్ గుండ్ల కుంట, తిమ్మాజి పల్లి గ్రామాల్లో రెవిన్యూ సదస్సులు జరిగాయి. తహాసిల్దార్ పార్థసారధి, డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో వేరువేరుగా జరిగిన రెవెన్యూ సదస్సులకు పలువురు ప్రజలు హాజరై తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు.ఆయా విషయాల్లో తప్పుల సవరణలు విరాసత్ తదితర అంశాలలో గ్రామస్తులు అధికారులను సంప్రదించి సలహాలు సూచనలు పొందుతున్నారు. అదేవిధంగా ఫరూక్ నగర్ మండలంలోని కడియాలకుంట తండాలో భూభారతి రెవెన్యూ సదస్సు లో పలు సమస్యలను వెలుగులో వచ్చాయి బూర్గుల గ్రామ రెవెన్యూ పరిధిలో కడియాల కుంట తండా గ్రామంలో సర్వే నంబర్ 887, 889, 890, 11,13, 14,15,4 ఈ సర్వే నంబర్లో గతంలో రైతుల పట్టా భూమిగా ఉన్న భూమి తర్వాత కాలంలో గత రెవెన్యూ అధికారులు సీలింగ్ భూమిక మార్చారు కాబట్టి ఇట్టి విషయాన్ని మం విషయంపై గ్రామ రైతులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీను నాయక్ తో కలిసి ఈ సదస్సులో ఫరూక్ నగర్ డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ను కలసి సమస్యను విన్నవించారు. విచారణ చేసి చేస్తామని డిప్యూటీ తాసిల్దార్ హామీ ఇచ్చారనీ తమ సమస్యలను డిప్యూటీ తాసిల్దార్ దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామ పరిధిలోని దాదాపు 100 ఎకరాల పొలం గతంలో కొందరు అధికారులు అత్యాశతో పట్టా భూములను లావోని భూములుగా చిత్రీకరించి ప్రజలను తికమక పెట్టారనీ ఈ భూమి యొక్క రికార్డులను తక్షణమే పరిశీలించిన డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ సింగ్ ఈ భూమి రైతుల యొక్క పట్టా భూములుగా రికార్డులో ఉన్నాయని వివరించడం జరిగిందన్నారు. రైతుల అప్లికేషన్లను తీసుకొని త్వరలో వాటి పరిష్కారాన్ని చేయాలని అధికారికి మొరపెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు కార్మికులు రైతులు సేవ్య నాయక్ తావు సింగ్ సందీప్ రాజు రమేష్. గోపి రవీందర్. జగన్ తదితరులు పాల్గొన్నారు