
పయనించే సూర్యుడు, డిసెంబర్ 26( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )
సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మునిగేలా రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ జే (టోనీ), బైరినేని రాము, సత్తు శ్రీనివాస్ రెడ్డి, పొన్నాల పరశురాము, సారంపల్లి గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ళ లావణ్య, తాడూర్ సర్పంచ్ సదానందం, గుగ్గిళ్ళ భరత్ గౌడ్, చిన్నమనేని ప్రశాంత్, మీరాల శ్రీనివాస్, భారతవ్వ, రేణుక, వెంకట్, ఖాదర్, జి. శ్రీనివాస్, శ్రీరామ్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
