పయనించే సూర్యుడు జూన్ 17 పోనకంటి ఉపేందర్ రావు
ఇల్లందు: కామేపల్లి మండలం పెంజర మడుగులో కమ్మ కులస్తులకు చెందినటువంటి భూస్వాములు మాదిగ పల్లెపై ఉక్కుముడిగా దాడి చేసి సంబంధం లేనటువంటి మాదిగా మన్యం భూములోకి ప్రవేశం చేసి భూమి సమస్యను సృష్టించి అక్కడున్నటువంటి మాదిగ రిటైర్డ్ హెచ్ యం చిప్పలపల్లి శ్రీనివాసరావు మరియు ఆటో డ్రైవర్ ఆనందరావుని కొట్టినారు వారి కూతుర్లైనా లక్ష్మి రేణుకలు మా నాన్న నీ ఎందుకు కొట్టారని అడుగుతే మహిళలని చూడకుండా వారిపై దాడి చేసి కళ్ళు చేతులు విరగొట్టారు ఎంత క్రూరత్వం అరాచకం ఎంతటి కుల అహంకారం ఐదు నుంచి పదిమంది కమ్మవారు ఈ ఆధునిక కాలంలో కులం పేరుతో దూషించి బూతు పదజాలంతో తిడుతూ అధికార పార్టీని అడ్డుపెట్టుకొని అక్కడున్నటువంటి కొంతమంది తమ స్వార్ధ రాజకీయాల కోసం మాదిగల పై దాడి చేసారు. ఈ దాడిని ఖండిస్తూ ఏపీఎంకె రాష్ట్ర నాయకులు మెంతెన ప్రభాకర్ మరియు మేకల సతీష్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మెంతెన వసంతరావు బీఎస్పీ జిల్లా నాయకులు కాళ్ళ రంజిత్ గాయపడిన వ్యక్తిని పరామర్శించారు ఈ దాడికి పాల్పడినటువంటి కమ్మ కులస్తులను వెంటనే అరెస్టు చేసి వారిపై ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టి వారి పై చట్ట పరమైన చర్యలు తీసుకొవాలని, ఈ వివాదానికి విషయం తెలుసుకోకుండా సహకరించినటువంటి కామ పెళ్లి ఎస్సై ని సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసినారు