పయనించే సూర్యుడు న్యూస్ (ఫిబ్రవరి.16/02/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కాపునాడు సత్యవేడు నియోజకవర్గ అధ్యక్షునిగా ఎన్నికైన బాలను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఘనంగా సత్కరించారు.ఆదివారం ఉదయం పిచ్చాటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ను కాపునాడు సత్యవేడు నియోజకవర్గ నూతన అధ్యక్షులు బాల మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలను ఎమ్మెల్యే ఆదిమూలం గజమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే కాపునాడు అభ్యున్నతికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమం లో ఏఎంసీ చైర్మన్ డీ ఇలంగోవన్ రెడ్డి, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి చిన్నా, టిడిపి నాయకులు పద్దు రాజు, బుజ్జి నాయుడు, రవి రెడ్డి, డిల్లీ బాబు, రజని తదితరులు పాల్గొన్నారు.