
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్ట్ 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా కూకట్పల్లి శ్రీశ్రీశ్రీ చిత్తారమ్మ తల్లి జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని, పూల తొట్టెల మరియు బోనం భక్తిశ్రద్ధలతో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తుల కోసం వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పులిహోర ప్రసాదాన్ని జాతర రోజు నిరంతరంగా పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ప్రసాదం అందిస్తూ భక్తి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు అమ్మవారిని ప్రార్థించారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు వేద ఆశీర్వచనాలతో యామిని రాజేశ్వరరావు దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మరియు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.చిత్తారమ్మ తల్లి జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులను మరియు నిర్వాహకులను వడ్డేపల్లి రాజేశ్వరరావు అభినందించారు.