
పయనించే సూర్యుడు న్యూస్ | ఫిబ్రవరి 12 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24వ స్థాపన దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో గురువారం ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం స్టేషన్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోలీస్ సిబ్బంది సమక్షంలో కేక్ కట్ చేసి స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు.ఈ సందర్భంగా సీఐ తిమ్మప్ప మాట్లాడుతూ పోలీసు శాఖకు క్రమశిక్షణే ప్రాణం, నిష్పక్షపాతత్వమే గౌరవం, ప్రజల నమ్మకమే అసలైన బలం అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ అధికారి ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో పోలీసులపై విశ్వాసం పెంపొందించుకోవడం ప్రతి సిబ్బంది బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఎస్ఐలు సత్యనారాయణ, ఫిలిప్ తదితరులు పాల్గొని సిబ్బందిని అభినందించారు. కూకట్పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటుతో నగర పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని పలువురు సిబ్బంది అభిప్రాయపడ్డారు. స్థాపన దినోత్సవం సందర్భంగా సేవా నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ పోలీసులు తమ కర్తవ్యపరమైన అంకితభావాన్ని వ్యక్తం చేశారు.
