
పయనించే సూర్యుడు న్యూస్ జులై 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి శాంతినగర్లోని శ్రీ గీతా కామేశ్వరి దివ్య క్షేత్రంలో నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ట మరియు మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ దత్తేశ్వరానందభారతి స్వామివారిని రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకొని, వారి అనుగ్రహ పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో భక్తి భావాన్ని, ధర్మ మార్గాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వడ్డేపల్లి రాజేశ్వరరావు పేర్కొన్నారు.గీతా కామేశ్వరి దివ్య క్షేత్రంలో జరుగుతున్న మహోత్సవాలు విజయవంతంగా జరగాలని, ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలని వారు ఆకాంక్షించారు.