
పయనించే సూర్యుడు ఏప్రిల్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో బుధవారం బీజేపీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఇండిగో విమానయాన సర్వీసులో ఇక్కడికొచ్చారు. కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాజానగరం సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, అడపా సుధీర్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.