తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మచ్చ వెంకటేశ్వర్లు రేపాకుల శ్రీనివాస్
పయనించే సూర్యుడు మార్చి 19 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి హైకోర్టు తీర్పు ప్రకారం భూమి నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం ముందు భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన, ధర్నా నిర్వహించిన అనంతరం ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు, ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్ష, కార్యదర్శులు మచ్చ వెంకటేశ్వర్లు,రేపాకుల శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలను ఉల్లంఘించి భూసేకరణ చేయడం వల్ల నిర్వాసితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని అన్నారు,2008 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టాన్ని, ప్రభుత్వం, పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతిని ఉల్లంఘించి కోయగూడెం ఓసీ 2, ఫిట్ 2,3 ప్రాజెక్టు కోసం 231.94 హెక్టార్ల పోడుసాగు భూములను టేకులపల్లి మండలం లచ్చగూడెం, కోయగూడెం , దంతెలతండ, కొత్తతండ, జేత్యతండ గ్రామాల గిరిజనుల నుంచి బలవంతంగా గుంజుకున్నారని తెలిపారు, న్యాయం కోసం గిరిజన నిర్వాసితులు గౌరవ హైకోర్టును wp no.2835/2010,30758/2010, ఆశ్రయించారన్నారు,2011సం,,లో గౌరవ హైకోర్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించింది, దీంతో జిల్లా రెవెన్యూ, సింగరేణి అధికారులు పునరావాస ప్యాకేజీ నామమాత్రంగా చెల్లించినారని, భూమి నష్టపరిహారం అసలు ఇవ్వలేదని అన్నారు, భూమి నష్టపరిహారం కోసం మళ్ళీ నిర్వాసితులు wp no 12169/2016, 12214/2016 కేసు వేసినారన్నారు,27/09/2024 న హైకోర్టు నిర్వాసితులకు నాలుగు వారాల్లో న్యాయం చేయాలని ఆదేశించింది, కానీ నష్టపరిహారం నేటికీ అందలేదన్నారు, వెంటనే హైకోర్టు తీర్పు అమలు చేసి భూమి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు, లేనియెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, పూనెం స్వామి,పూనెం చంద్రశేఖర్, దొడ్డ సంపత్ కుమార్, దొడ్డ కోటేశ్వరరావు,చీమల క్రిష్ణ,బానోత్ వస్రాం, నరేష్, లక్ష్మి,ఈసం చుక్కమ్మ, తదితరులు పాల్గొన్నారు.