గొల్లపల్లి, దూపాడు లో పొలం పిలుస్తుందిపయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 త్రిపురాంతకం మండలంమండలంలోనిగొల్లపల్లి, దూపాడు గ్రామాలలోని గ్రామ రైతు సేవా కేంద్రం నందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఆయా గ్రామాల్లో ఉన్న రైతు సోదరులతో కలిసి సాగు చేస్తున్న మిరప, వరి పంటలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అనంతరం రైతు సేవ కేంద్రం వద్ద గ్రామసభ నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కె. నీరజ మాట్లాడుతూ

- రబీలో పంటలు వేసిన ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ క్రాప్ నందు నమోదు చేయించుకోవాలని తెలియజేశారు.
2.రబీలో సాగు చేసిన పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించటం జరిగినది.. ఈ కార్యక్రమం లో వ్యవసాయ అధికారి కె. నీరజ ఆయా గ్రామ సిబ్బంది షేక్ మసూద్ బాషా, మాదాసు వెంకటేశ్వర్లు రైతులు ఈ పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది
https://www.pstelugunews.com