పయనించే సూర్యుడు మే26 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం
ఇంటర్మీడియట్ మరియు టెన్త్ క్లాసులలో ఇటీవల ఉత్తీర్ణులైన ఈడిగ కుల విద్యార్థిని,విద్యార్థులను సత్కరించి వారికి ప్రతిభా పురస్కారాలను ఇవాళ సుండుపల్లి మండలం లో అందజేయడం జరిగింది.సుండుపల్లి మండలం ఈడిగపల్లె గ్రామంలో టెన్త్ క్లాసు మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన ఎరికాల దీపక్ గౌడ్ , ఎరికాల ప్రసాద్, రాయవరం కుడుమల్లపల్లి చెందిన జవ్వాజి వెన్నెల గౌడ్ , బండ కాడ ఈడిగపల్లెకు చెందిన గుర్లకుంట జయవర్ధన్ గౌడ్లకు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను అభినందనలు తెలియజేస్తూ మెమెంటో, ప్రశంసా పత్రాలతో పాటు తగు నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేసి సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో చైర్మన్ మన్నెం రామమోహన్, వైస్ చైర్మన్ పోల్టాస్ రమణయ్య, ట్రెజరర్ భువనేశ్వర్ గౌడ్, ఎరికాల రామాంజనేయులు, జయప్రకాష్,అనుదీప్,వంశీ, సునీల్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నరు.