గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్ .
పయనించే సూర్యుడు; జూన్ 02: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు;ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆదివాసీ కే ఇవ్వాలని గొండ్వాన సంక్షేమపరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి డిమాండ్ చేశారు.సోమవారం నాడు మీడియా ముఖంగా పూనెం సాయి మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల ఓట్ల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తారు తప్ప, పదవులలో నియమించేటప్పుడు, ఆదివాసీలు ఎందుకు గుర్తురారని ఆయన ప్రశ్నించారు. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో గ్రంథాలయ చైర్మన్ పదవి ఇవ్వడానికి ఒక్క ఆదివాసీ దొరకడం కనబడటం లేదా అని నిలదీశారు .ములుగు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా గత తెరాస ప్రభుత్వం లో లంబాడి వర్గం కు చెందిన గోవింద్ నాయక్ నియమిస్తే, మళ్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ లంబాడి వర్గానికి చెందిన,బానోత్ రవిచందర్ కి ఇవ్వడం ఎంతవరకు సమన్యాసం అని అన్నారు. గ్రంథాలయం చైర్మన్ పదవి కనీసం డిగ్రీ కూడా పూర్తి చెయ్యని వారికి ఇవ్వటం విడ్డూరం అని అన్నారు,లంబాడి వర్గం చెందిన వారిని చైర్మన్ గా ఉంటే, ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నారని వ్యక్తం చేశారు.ఇది ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే మొదటి స్థానం ములుగు అవుతుందని హెచ్చరించారు.