పయనించే సూర్యుడు జూన్ 6 పొనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి:ఇట్స్ చారిటి టైమ్ ఇల్లందు వ్యవసాయ మార్కెట్కమిటీ-ఇల్లందు సిబ్బంది జి.రంజిత్ ఆధ్వర్యంలో అమృత మల్టీ స్పెషాలిటి వైద్యశాల కొత్తగూడెం, ఏజిఎస్ స్మైల్ మల్టీ స్పెషాలిటి దంత వైద్యశాల మరియు అపోలో డయగ్నోస్టిక్స్ ఖమ్మం వారి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిభిరం శుక్రవారం ఉప్పు రాయి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఒడ్డుగూడెం, కొప్పురాయి గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి 325 మందికి షుగర్, బిపి. వైద్య పరీక్షలను నిర్వహించి అనంతరం ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చారిటీ సెక్రెటరీ ఈ నరేష్ కుమార్ మాట్లాడుతూ. గత రెండు సంవత్సరాలుగా ఇట్స్ చారిటీ టైమ్స్ ద్వారా అనేక మెడికల్ క్యాంపులను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటం తన లక్ష్యమని వారు తెలియజేశారు. అనంతరం అమృత హాస్పిటల్ డాక్టర్ ఈ. బాబురావు మాట్లాడుతూ, ఇక్కడ ప్రజలు ఎలాంటి వ్యాధులతో ఇబ్బంది పడి ఉంటే కొత్తగూడెం అమృత హాస్పిటల్ కి వచ్చినట్లయితే మీకు ఉచితంగా వైద్యం చేస్తామని వారు తెలియజేశారు. డాక్టర్ ప్రజల కు సలహా సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో డెంటల్ డాక్టర్ కవిత, డాక్టర్ జయ ల్యాబ్ టెక్నీషియన్స్,ఐ. ప్రసన్న, ఎస్ చందన, వై మధు, గోపి, పిఆర్ఓ చంద్రకళ, మాజీ సర్పంచ్ జే సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.