పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 20
చింతూరు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీ మంగళవారం నుండి మూడు రోజులపాటు ప్రత్యేక ఆధార్ మేగా క్యాంపులు నిర్వహించబడనున్నాయి. ఈ క్యాంపుల ప్రధాన ఉద్దేశం పీవీటీజీ కమ్యూనిటీలలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కల్పించటం, 100 శాతం నమోదుతో ఆధార్ సంతృప్తి స్థాయికి తీసుకురావడమే.ఈ క్యాంపులో చింతూరు, యటపాక, కునవరం, వీ.ఆర్.పురం మండలాల్లోని గ్రామాలకు చెందిన ఆధార్ లేని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణ మరియ ఆధార్ అప్డేట్ సేవలు వంటి సేవలు ఈ సేవా కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి."సూచించారు.ఈ సందర్భంగా ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి గారు తెలియజేస్తూ, ప్రతి గ్రామంలో ఉన్న సచివాలయ సిబ్బందికి సమన్వయం బాధ్యతలు అప్పగించబడినట్లు తెలిపారు. వారు గ్రామస్తులకు ఈ క్యాంపుల గురించి అవగాహన కలిపించి, ఆధార్ లేని వారు తప్పక క్యాంపుకు హాజరుకావలసిందిగా సూచించారు. ఆధార్ లేని వారు తమ వద్ద ఉన్న గుర్తింపు పత్రాలు మరియు అవసరమైన ఆధారాలు క్యాంప్కు తీసుకురావలసి ఉంటుంది. ఈ క్యాంప్కి హాజరయ్యే ప్రతి ఒక పివిటిజి వారు డొమెసైల్ ప్రూఫ్ మరియు ఫోటో తప్పనిసరిగా తీసుకురావాలి దరఖాస్తు ఫారాలు ఐటిడిఏ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. మరియు ఇటీవల పీఎం జన్మన్ , ప్రాధాన్య గిరిజన అభివృద్ధి కార్యక్రమాల కింద ఆధార్ ఉండటం అవసరమైనదిగా ప్రభుత్వం నొక్కి చెబుతోందని, అందువల్ల ఆధార్ లేకపోవడం వల్ల పలు పథకాలకు దూరంగా ఉన్న గిరిజన కుటుంబాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ అపూర్వ భరత్ గారు ఐ ఏ ఎస్ వారు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, సంఘ సంస్కర్తలు సహకరించాలని కోరడమైనది.ఈ మేగా క్యాంపులకు అవసరమైన సమన్వయం మరియు పర్యవేక్షణ బాధ్యతలను ఐటిడిఏ అధికారులు మరియు పిఎంయు (PMU) సిబ్బంది నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్యాంపులు ప్రజలందరికీ ఉపయోగపడేలా, అవసరమైన సేవలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.