పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 9 అల్లూరిసీతారామరాజు జిల్లా
చింతూరు డివిజన్లోని చింతూరు ఎర్రంపేట గ్రామాలలోరహదారి విస్తరణలో భాగంగా ఆదివాసీలు నిర్మించుకున్నటువంటి గృహాలు మరియు దుకాణములకు నష్టం వాటిల్లకుండా చూడాలని చింతూరు తాసిల్దార్ చిరంజీవి గారిని కలిసి దరఖాస్తు ఇవ్వడం జరిగింది, ఆదివాసి నిరుద్యోగులు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఆదివాసి వ్యాపారస్తులు జీవనం సాగిస్తున్నారని మొత్తం చింతూరు,ఎర్రంపేట లో 30 కుటుంబాలు జీవన ఉపాధి కోల్పోతున్నారు వారికి చింతూరు మరియు ఎర్రం పేట గ్రామాల్లో ప్రభుత్వ స్థలం కేటాయించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరారు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని విన్నవించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదివాసి వ్యాపారస్తులు మడివి. రాజు కారం సాయిబాబు సవలం. భద్రయ్య, జల్లి. నరేష్ మీడియం కొండయ్య తదితరులు పాల్గొన్నారు