పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 16:- రిపోర్టర్ (కే శివకృష్ణ ) బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక జర్నలిస్ట్ను ఎమర్జెన్సీ వార్డులో ప్రవేశించ కుండా అవమానపరిచిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ఈరోజు జాయింట్ కలెక్టర్ ప్రఖార్ జైన్ మరియు వైద్య విధాన్ పరిషత్ డి.సి. శేషు కుమార్కు చీరాల జర్నలిస్టులు మిత్రులు కలిశారు కలిసి వినతి పత్రం అందజేశారు. అధికారులిద్దరూ ఈ విషయాన్ని జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు తదుపరి జర్నలిస్టులందరూ కలిసికట్టుగా ఉండి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం ఎంతైనా మంచిదని సూచించారు