

పయ నించే సూర్యుడు జూలై 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా :ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ సంచాలకులు చెల్లి అశోక్ 55వ పుట్టినరోజు వేడుకలను ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.నగర తెలుగుదేశం పార్టీ షెడ్యూల్డ్ కులాల విభాగ అధ్యక్షులు గొల్లపల్లి గోపి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు కట్ట సత్తిబాబు ముఖ్య అతిథిగా హాజరై భారీ కేక్ కట్ చేశారు. అశోక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడారు.నీటి సంఘ అధ్యక్షులు సరిపెల్ల శ్రీను రాజు మాట్లాడుతూ, అశోక్ నిబద్ధతతో పార్టీ కార్యకర్తలకు సేవలు అందిస్తూ వెన్నుదన్నుగా ఉంటున్నారని, అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటారని అన్నారు. అనంతరం ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. అన్న క్యాంటీన్లో పురపాలక సంఘ కమిషనర్ పి. రవివర్మ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం సొసైటీ అధ్యక్షులు దొమ్మేటి రమణ కుమార్, పట్టణ వెనుకబడిన తరగతుల విభాగ అధ్యక్షులు జాగు సత్తిబాబు, మాజీ కౌన్సిలర్ పిల్లి నాగరాజు, రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా నిర్వహణ కార్యదర్శి మెండి కమల, పార్లమెంట్ షెడ్యూల్డ్ కులాల విభాగ అధ్యక్షులు జక్కల ప్రసాద్, యాళ్ల ఉదయ్, చప్పిడి ప్రసాద్, కాశి లాజర్, నిమ్మకాయల విషు, మాజీ ఉప సర్పంచ్ బూరుగు కళ్యాణ్, కటికిదళల నాని, కన్నీడి శివప్రసాద్, ఏళ్ల బాలకృష్ణ, కాశి మూర్తి, మెండి కృష్ణబాబు, జనపల్లి సత్యనారాయణ, పిల్లి సత్తిబాబు, గంజా సూరిబాబు, కె.వి.వి. సత్యనారాయణ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.