కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామమనికి చెందిన చొప్పరి రాజయ్య - లక్ష్మీ దంపతుల కూతురు సురక్షిత రోడ్డుపై నడుచుకుంటూ వెళుచుండగా వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి ఈ దాడిలో గాయపడిన చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం కాసిపేట 1వ గని (సర్వే డిపార్ట్మెంట్) చేయుత స్వచ్ఛంద సంస్థ వారిచే ఆర్థిక సహాయం రూపాయలు 5000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ , సంస్థ అధ్యక్షులు ఆడెపు రవీందర్ ప్రధాన కార్యదర్శి అంకం రాయమల్లు చేతుల మీదుగా ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి సంఘటన జరుగుడు దురదృష్టకరం ప్రభుత్వం స్పందించి వీధి కుక్కల బారి నుండి ప్రజలను చిన్నారులను రక్షించాలని వెంటనే ప్రభుత్వ పరంగా. చర్యలు తీసుకొని వీధి కుక్కలను తొలగించాలని, నిరుపేదైన చొప్పరి రాజయ్య లక్ష్మీ లకు దాతలు ముందుకు వచ్చే ఆర్థిక సాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, మేకల ఆంజనేయులు, దాగం ఆనంద్, బండి గణేష్, బిజ్జురు కిషన్, పాల్గొన్నారు.