పయనించే సూర్యుడు: మే 27: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మోరుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమం లో భాగంగా జాతీయ వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం పల్లె దవాఖాన వైద్యురాలు డాక్టర్ జ్ఞానస ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ యొక్క కార్యక్రమంలో
మిషన్ ఇంద్రధనస్సులో భాగంగా టీకా వేసుకొని వారికి ప్రత్యేకంగా మిస్ అయినవారికి పల్లె దవాఖాన వైద్యాధికారి, జ్ఞానస ఆధ్వర్యంలో బిజినేపల్లి, మొరుమూరు గ్రామాలలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించడం జరిగినదని తెలియజేశారు. ఈయొక్క కార్యక్రమంలో వైద్య అధికారి జ్ఞానస,.హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి,ఏఎన్ఎం. కన్యాకుమారి, మరియు ఆశా కార్యకర్తలు,అరుణ,లక్ష్మి, పాల్గొన్నారు.ఈయొక్క ఈ కార్యక్రమంప్రగల్లపల్లి అంగన్వాడి సెంటర్ లో నిర్వహించడం జరిగినదని తెలియజేశారు.