
భద్రాద్రి జిల్లా విద్యార్థుల హక్కులను ఖమ్మంలో ఎందుకు తాకట్టు పెట్టారు?
జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలి: సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్
పయనించె సూర్యుడు మార్చి 24(పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి :సేవాలాల్ సేన మండల కమిటీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బానోత్ కిషన్ నాయక్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు వారు ఈ సమావేశానికి ఉద్దేశించిమాట్లాడుతూ టేకులపల్లి మండలంలోని నిరుపేద వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం మంజూరైన మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే (MJPTBC) గురుకుల పాఠశాల గడచిన 10సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో కొలువుదీరడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి అని సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్ తీవ్రంగా ప్రశ్నించారు. 2016-17 విద్యా సంవత్సరంలో టేకులపల్లి మండల కేంద్రంలోనే అట్టహాసంగా ప్రారంభమైన ఈ పాఠశాల కేవలం కొన్ని నెలలకే సౌకర్యాల నెపంతో ఖమ్మం జిల్లాకు తరలించబడింది. నాటి నుంచి నేటి వరకు (2026) అంటే దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా, తిరిగి సొంత మండలానికి తీసుకురావడంలో అధికారుల జాప్యం వెనుక ఉన్న మతలబు ఏమిటి అని అన్నారుఉమ్మడి ఖమ్మం జిల్లా విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి ఏడేళ్లు దాటినా మా జిల్లాకు కేటాయించిన పాఠశాల పక్క జిల్లాలోనే ఎందుకు కొనసాగుతోందనీ మన జిల్లా అధికారులకు మన విద్యార్థుల ప్రయోజనాల కంటే పొరుగు జిల్లా ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారుటేకులపల్లి మండల మ్యాప్లోఉండాల్సినపాఠశాలమాయమైందని దీనిపై రెడ్ లైన్ వేసి మరీ వెతకాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని సురేష్ నాయక్ ఎద్దేవా చేశారు.60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మంకు వెళ్లి చదువుకోవడం వల్ల స్థానిక గిరిజన, బిసి విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. స్థానికంగా భవనాలు లేవా? లేక నిర్మించే ఉద్దేశం లేదా? అని ప్రశ్నించారు. పదవ తరగతి బోర్డు పరీక్షలు రాయడానికి విద్యార్థులు పడుతున్న అవస్థలను ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా గుర్తించాలని దాదాపుగా 60 కిలో మీటర్లు ప్రయాణం చేస్తూ మండలానికి చేరుకొని పదవ తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్నారని అన్నారు జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించాలనీ టేకులపల్లి మండలంలో ప్రభుత్వ స్థలాలు, భవనాలు అందుబాటులో ఉన్నప్పటికీ పాఠశాలను ఇక్కడికి తరలించకపోవడం వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరో తేల్చాలనీ. వెంటనే విచారణ జరిపి, వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి పాఠశాల టేకులపల్లిలోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో, సేవాలాల్ సేన ఆధ్వర్యంలో మండల ప్రజలు, విద్యార్థి సంఘాలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సేవాలాల్ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి లౌడియావెంకటేష్నాయక్,జిల్లాఉపాధ్యక్షులు బోడ రమేష్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి బానోతు నాగరాజు నాయక్, జిల్లా ప్రచార కార్యదర్శి జరూపల లాలు నాయక్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు బోడ బాలు నాయక్, ధరావత్ కో క్యా నాయక్, ధరావత్ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు