
పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి : గురువారం టేకులపల్లి మండలంలో భారీ వర్షం మూలంగా నష్టపోయిన పంటలను కలెక్టర్ జితేష్ వి పాటిల్ టేకులపల్లి మండలం లోని తంగెళ్ళ తండా గ్రామంలో పంటనష్టం జరిగిన వరి పొలాలను సందర్శించి రైతులకు పంటలోనిల్వ ఉన్న నీటిని బయటకు పంపి వేసుకోవాలని , దానిద్వార మళ్ళీ పంటలులేస్తాయి అని సూచనలు చేశారు అలాగే రైతులు ఉపాధి హామీ లో వున్న పథకాలను సద్వినియోగం చేసుకొని మునగ పంట, పామ్ ఆయిల్ పంటలను వేసుకోవాలని అలాగే పశువుల షెడ్ ఏర్పాటు చేసుకొని పశువులను వ్యాధి ల బారినుండి కాపాడాలని సూచించారు ఈ కార్యక్రమంలో డి ఏ ఓ బాబురావు , ఏ డి ఏ.జి లాలూ చాంద్ ఎం ఏ ఓ అన్నపూర్ణ ఏ ఈ ఓ రమేశ్ రైతులు పాల్గొన్నారు