విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ సిఐ..
రుద్రూర్, ఆగస్టు 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలో గల ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో విద్యార్థులు, విద్యార్థినీలకు బుధవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ మాట్లాడుతూ.. రోడ్డు పై వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. అలాగే సైబర్ క్రైమ్, యాంటీ ర్యాగింగ్ లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంచార్జ్ డ్రీన్ శ్రీలత, ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్, రుద్రూర్ ఎస్సై సాయన్న, ప్రోగ్రాం ఇంచార్జ్ శివకుమార్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.